అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి దమ్ముంటే తెలంగాణ పురపాలకశాఖ మంత్రిగా తనపై కేసు పెట్టాలని ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు సవాలు విసిరారు. ‘హైదరాబాద్ నగరంలోని ఐడీపీఎల్ నుంచి రోడ్లు వేస్తుంటే కేసులు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆదేశాలిస్తున్నరంట.. అధికారులు.. కార్మికుల మీద కేసులు పెట్టడం కాదు.. నీకు చేతనైతే.. కేసు పెట్టాల్సివస్తే మున్సిపల్శాఖ మంత్రిగా నా మీద, ప్రభుత్వం మీద కేసు పెట్టండి’ అని అన్నారు.
నాలుగేండ్ల పాటు సైన్యంలో కాంట్రాక్టు పద్ధతిన పని చేయించుకొని విసిరికొట్టే దుర్మార్గ విధానం ‘అగ్నిపథ్’. ఇది అటు సైన్యానికీ, ఇటు యువతకూ అవమానం. యువత ఆగ్రహానికి బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా అట్టుడుకుతూ ఉంటే కేంద్ర పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదు. అందుకే యువత తిరుగుబాటును ప్రతిపక్షాల రాజకీయంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నరు.
తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం యత్నిస్తోందని, వీటికి రాష్ట్ర సర్కారు కేటాయించిన భూముల విలువ సుమారు రూ. 40వేల కోట్ల వరకూ ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందని కేటీఆర్ తెలిపారు
ఎనిమిదేండ్లుగా ప్రధాని మోదీ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాల ఫలితమే ప్రస్తుత దేశవ్యాప్త నిరసనలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు
కృష్ణా జలాల్లో వాటాను తేల్చడంలో కేంద్రం విఫలమైందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు
దేవుళ్లను, గ్రంథాలను అడ్డుపెట్టుకొని, కనీసం వాటిని చదువకనే, దేవుళ్ల బోధను ఆచరించకనే, వారి పేర నీచ రాజకీయాలు చేస్తుంటరు కొంతమంది. వీరు వర్తమానంలోని చరిత్రహీనులు. మరింత ప్రమాదమేమంటే.. బండరాయి లాంటి వీరు తాము మునుగుతూ దేశాన్ని కూడా ముంచుతరు.
మసీదులు తవ్వుతామంటూ బీజేపీ నేతలు రాష్ట్రంలో మత చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు మసీదులు తవ్వితే.. మేం అభివృద్ధి పనులకు పునాదులు తవ్వుతాం. ప్రార్థనాలయాలు కాదు.. చేతనైతే దేవరకద్రలోని బీడు భూములు తవ్వి నీరు పారిద్దాం. మేంగుడులు కడుతున్నాం. వాటితోపాటే ప్రాజెక్టులు కూడా కడుతున్నాం. యాదాద్రి లాంటి గొప్ప ఆలయం నిర్మించిన ఘనత మా ప్రభుత్వానిదే.
అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి దిశా నిర్దేశనం చేసే కరదీపికగా మారింది.
Format C-2 of TRS candidates for biennial election to the council of states for the constituency – by the elected members of Telangana Legislative Assembly.
Please contribute generously to the TRS Party.